- Advertisement -
నవతెలంగాణ–మల్హర్ రావు
మహాశివరాత్రి ఉత్సవాలు పురస్కరించుకుని మండలం పెద్దతూండ్ల గ్రామంలోని శ్రీహనుమాత్సహిత రాజరాజేశ్వరి పంచాయత దేవాలయం, గాదంపల్లిలోని శ్రీహనుమాత్సహిత శివపంచాయతన దేవాలయాల ఆవరణంలో శివపార్వతుల కళ్యాణమహోత్సవం వేదపండితులచే అంగరంగవైభవంగా ఆదివారం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఉత్సవాన్నీ తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల సందర్శకుల అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కళ్యాణమహోత్సవంలో మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు-అమల దంపతులతోపాటు పలువురు దంపతులు, సందర్శకులు హాజరయ్యారు.
- Advertisement -



