- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జన్మదినం సందర్భంగా జన్నారం మండలంలోని టీజీ పల్లె గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు పెన్నులు, నోట్బుక్కులను బీఆర్ఎస్ యూత్ నాయకుడు కొట్టే హరికృష్ణ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు కానుకగా పెన్నులు, నోట్బుక్కులు అందించడం ఆనందంగా ఉందని తెలిపారు. సందర్భంగా ఉపాధ్యాయులు కొట్టే హరికృష్ణను అభినందించారు.
- Advertisement -



