బకాయిలపై సుదీర్ఘంగా చర్చ
ప్రతినెలా రూ. 10 కోట్లీస్తాం:ఈడీలు
కాదు..రూ.100 కోట్లు ఇవ్వండి:నేతలు
అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించి ప్రమోషన్లు
ఇస్తామన్న కమిటీనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబం ధించి రెండో దఫా చర్చలు శనివారం హైదరాబాద్ బస్సు భవన్లో నిర్వహించారు. ఆర్టీసీ జేఏసీతోపాటు ఇతర సంఘాల నేతలు ఇందులో పాల్గొన్నారు. ఆయా సమస్యలపై ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల(ఈడీ)ల కమిటీతో ఆర్టీసీ కార్మిక సంఘాలు సమగ్రంగా చర్చించాయి. సమ్మె డిమాండ్లు, ఇతర అంశాలపై సుదీర్ఘంగా ఇరుపక్షాలు మాట్లాడుకున్నాయి.
రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను చెల్లించాలనే విషయమై ఎక్కువసేపు సంప్రదింపులు చోటు చేసుకు న్నట్టు సమాచారం. ఈ చర్చలో వీరికి ప్రతినెలా రూ.10కోట్లు ఇస్తామని యాజమాన్యం తెలియ జేసింది. ఇందుకే కార్మిక నేతలు ససేమిరా అన్నారు. ప్రతినెలా కనీసం రూ.100 కోట్లు ఇవ్వాలని సంఘాలు కోరాయి. ఇందుకు దశల వారీగా ప్రతినెలా పెంచుతూ ఆ డబ్బులు సర్దుబాటు చేయడానికి కృషి చేస్తామని యాజమాన్యం హామినిచ్చింది. రిటైరై అవుట్ సోర్సింగ్ పనిచేస్తున్న సూపర్వైజర్లు, ఆఫీసర్లను తొలగించి త్వరలో వారి స్థానంలో అర్హులైన ఉద్యోగులకు ప్రమో షన్లు ఇస్తామని యాజమన్యం చెప్పింది. ఉద్యోగా లు కోల్పోయిన వారిలో, కోర్టులో పెండింగ్లో ఉన్న 27 కేసులను లోక్ అదాలత్ నుంచి రాగానే వాటిని పరిష్కరించడానికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకరిం చింది. హయ్యర్ పెన్షన్ దరఖాస్తుల్లో తిరస్కరణకు గురైనవాటిని పరిష్కరించడానికి ఆర్టీసీ తరపున జూనియర్ స్కేల్ ఆఫీసర్ ను జూలై నెలలో నియమిం చేందుకు ఈడీల కమిటీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. 2019 సమ్మె కాలంలో పెట్టిన పోలీస్ కేసులను ఎత్తి వేయడానికి ప్రభుత్వానికి యాజమాన్యం ద్వారా లేఖ రాయనున్నట్టు చెప్పింది. మోటారు ట్రాన్పోర్టు చట్టం ప్రకారం డ్యూటీలను రూట్ సర్వే ప్రకారం రన్నింగ్ టైమ్ ఫిక్స్ చేయడానికి అంగీకరించారు, ఈ అంశంపై ఆర్ఎంలు, డీఎంలు, కార్మిక సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని వారికి ఆదేశాలు ఇస్తామని ఈడీల కమిటీ తెలియజేసింది.
ఉద్యోగ భద్రత విషయంలో కూడా చాలాసేపు చర్చ జరిగింది. ఈ చర్చలో టికెట్ తీసుకుని ప్రయాణించే బాధ్యత పూర్తిగా ప్రయాణికులదే ఉండాలని కోరడం జరిగింది. అలాగే కండక్టర్ డ్రైవర్లకు ఎలాంటి కేసులు రాయకూడదని విషయంలో ఈడీలు, కార్మిక నేతల మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నట్టు సమాచారం. దీనిపట్ల ఒక కమిటీ వేస్తామని ఆ కమిటీకి కార్మిక సంఘాల అభిప్రాయాలను తెలియజేయాలని యాజమాన్యం స్పష్టం చేసింది. ఆ కమిటి ఉద్యోగ భద్రత గైడెలైన్స్ రూపొందించిన తర్వాత ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ యూనియన్లకు ఇస్తామనీ, వాటిని యూనియన్లు అంగీకరించిన పిదప యాజమాన్యం సర్క్యులర్ రూపంలో ఇవ్వనుంది. తెలంగాణ, ఆంధ్రలో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఒక లేఖ రాస్తూ సంబంధిత ఉద్యోగుల బదిలీ దరఖాస్తులు ఆ ప్రభుత్వానికి పంపించనున్నారు. ఏపీలో గతంలో డిప్యూటేషన్ పై పనిచేసిన ఉద్యోగులకు తెలంగాణలో రిటైరైన తర్వాత వారికి గ్రాట్యుటీ చెల్లించాలని లేఖలు రాసినట్టు తెలియజేస్తూ, వాటి చెల్లింపుల కోసం మరో సారి లేఖలు రాస్తామని ఈడీలు కార్మిక నేతలకు చెప్పారు.
బ్రీత్ అనలైజర్ టెస్ట్లో 30 శాతం వరకు ఎలాంటి రిపోర్ట్ వ్రాయరనీ, రెండసారి టెస్ట్కు అనుమతించరనీ, పాత మిషన్లను మార్చి కొత్త మిషన్లు కొంటామని అంగీకరించారు. బ్రెడ్ విన్నర్ స్కీమ్ కింద ప్రస్తుతం పని చేస్తున్న వారందరినీ రెగ్యులర్ చేస్తూ వారు చేరినప్పటి నుండి సర్వీసును వర్తింపజేస్తూ రెగ్యులర్ చేయనున్నారు. జూలై నెలలో జరిగే బోర్డు మీటింగ్లో ఆమోదం పొందిన తర్వాత సర్క్యోలర్ విడుదల చేయనున్నారు. ఆ వెంటనే 2021 కొత్త పే స్కేల్ వర్తింపజేస్తామని ఈడీల కమిటీ స్పష్టం చేసింది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి డిప్యూటీ సీఎం సంతకం కాగానే అందరికి పోస్టింగ్లు ఇవ్వనున్నట్టు ఈడీలు తెలియజేశారు. ఈడీల కమిటీ జేఏసీ నాయకులంతా పాల్గొన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఈడీలతో రెండో దఫా భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



