- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
కామారెడ్డిలో రాజకీయ పరిస్థితి పరిశీలనలో భాగంగా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు మద్దతుగా ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి ఎమ్మెల్సీ అంజిరెడ్డి హైదరాబాదు నుండి వెళ్తున్న క్రమంలో మేడ్చల్ బస్టాండ్ వద్ద పోలీసులు అడ్డగించారు. దీనితో ఎమ్మెల్యే పోలీసులతో వాగ్వాదం చేశారు రోడ్డు పై కూర్చొని నిరసన తెలిపారు. పోలీసులు ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డిని ఎమ్మెల్సీ అంజిరెడ్డి నీ పోలీస్ వాహనంలో పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇలా అణిచివేత చేయడం అంటే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడమే అని అతి త్వరలో కామారెడ్డికి బయలుదేరుతామని వెల్లడించారు.
- Advertisement -



