- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యుర్ గ్రామపంచాయతీ పరిడీలోగల పివినగర్ అటవీప్రాంతంలో మానేరు ప్రక్కనున్న పురాతన ఆలయాలైన నైన గుళ్లలోని మహారామలింగేశ్వర స్వామిని రిటైర్డ్ ఆడిషనల్ ఎస్పీ పనకంటి గీతా-రమాకాంత్ రావు దంపతులు మంగళవారం సందర్షించారు. అలయకమిటి వారికి ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురాతన ఆలయాలు అద్భుతంగా ఉన్నాయని, దేవాదాయశాఖ, ఎండోమెంట్ ఉన్నతాధికారులు, ప్రభుత్వం పట్టించుకోని ఎండోమెంట్ లో చేర్చాలని రమాకాంత్ రావు కోరారు. అనంతరం ఉప సర్పంచ్ లకావత్ సవేందర్, శేషివర్ధన్, గడ్డం లచ్చయ్య, కుంభం బాపురెడ్డి, కట్కమ్ శ్రీనివాస్ దంపతులను శాలువాతో సత్కరించారు.
- Advertisement -



