Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి

త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి

- Advertisement -

– ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ 
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
వేసవి దృష్ట్యా మండలంలో ఎక్కడ కూడా త్రాగునీటి  ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి చింత రాజా శ్రీనివాస్ అన్నారు.బుధవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఈజిఎస్ సిబ్బందితో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీల్లో మొక్కల పెంపకంపై దృష్టి సారించాలన్నారు.

నర్సరీల నిర్వహణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించోద్దని సూచించారు. ఇంటి పన్నుల వసూళ్లలో వేగం పెంచాలని, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఇంటి పన్నుల వసూళ్లే కీలకమన్నారు. ప్రత్యేక బృందాలతో స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించి ఇంటి పన్నులను వసూలు చేయాలని, 100శాతం పన్నుల వసూల్లే లక్ష్యంగా పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను  వేగవంతం చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్లు మంజూరై ఇప్పటివరకు పనులు ప్రారంభించుకొని లబ్ధిదారులు తక్షణమే ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించేలా ప్రోత్సహించాలన్నారు. గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి పెట్టాలని పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం పై చర్చించారు. అర్హులైన ప్రతి ఒక్కరు ఈ పథకంలో చేరేలా కృషి చేయాలన్నారు.

ఈ సమావేశంలో మండల పంచాయతీ అధికారి సదాశివ్, ఈజీఎస్ ఏపీవో విద్యానంద్, హౌసింగ్ ఏఈ రాకేష్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -