నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మైబాపూర్ గ్రామంలో బుధవారం నాడు సాయంత్రం వేళలు గ్రామ సమీపాన ఉన్న ఒక వ్యవసాయ భూములు పులి సంచరించినట్టు గ్రామానికి చెందిన పలువురు యువకులు చూసి గ్రామస్తులకు తెలపడం జరిగింది. ఇట్టి విషయాన్ని గ్రామస్తులు అందరూ కలిసి వ్యవసాయ భూమికి వెళ్లి చూడగా అప్పటికే చిరుత పులి అక్కడ నుండి వెళ్లిపోవడం జరిగిందని అన్నారు. అక్కడ పాదముద్రలను గమనించిన గ్రామస్తులు వెంటనే వాటిని వీడియోలో చిత్రీకరించడం జరిగింది. పులి సంచరిస్తున్న విషయాన్ని ఎఫ్ఆర్ఓ సంతోష కు తెలపడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.
వెంటనే ఫారెస్ట్ అధికారులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించగా అక్కడ ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదని తెలిపారు. అప్పటికే అక్కడ సంచరించిన స్థలంలో ఎటువంటి ఆనవాళ్లు కనబడలేదని చెప్పారు సంతోష మీడియాకు తెలియజేశారు. గ్రామస్తులు వీడియోలు చిత్రీకరించిన పాదముద్రలు ఏవని అవి దేనికి సంబంధించిన పాదముద్రలు అని విలేకరులు అడగగా ఇలా వివరించారు… ఈ పాద ముద్రలు చిరుత పులికి సంబంధించినవి కావని నిర్ధారణ చేయడం జరిగిందని చెప్పారు మేడం తెలిపారు. గ్రామస్తులు ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రం పూట బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.



