Friday, February 27, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొనసాగుతున్న డేంజర్ జోన్ ఇండ్ల సర్వే.!

కొనసాగుతున్న డేంజర్ జోన్ ఇండ్ల సర్వే.!

- Advertisement -

ఇళ్లపై సమగ్ర విచారణకు ఆదేశాలు
ఈ నెల 21న తహశీల్దార్ కార్యాలయానికి లేఖ
400 ఇండ్ల వరకు సర్వే పూర్తి
నవతెలంగాణ – మల్హర్ రావు

తాడిచెర్ల ఓసిపి బ్లాక్-1కు డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లను సమగ్ర పూర్తి సర్వే చేసి నివేదికను వారం రోజుల్లో తమకు సమర్పించాలని ఈ నెల 21న తహశీల్దార్ కార్యాలయానికి ఉన్నతాధికారులు పంపిన లేఖతో మండల తహశీల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో ఇండ్ల సర్వేను ఈ నెల 25 నుంచి ప్రారంభించారు. అధికారులు బృందాలుగా ఏర్పడి ఇంటింటా పిల్డ్ సర్వేలు నిర్వహిస్తున్నారు. డేంజర్ జోన్‌లో ఉన్న ఇళ్ల వివరాలపై పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేస్తున్నారు. డేంజర్ జోన్ పరిధిలో మొత్తం ఎన్ని ఇళ్లు ఉన్నాయి. వాటిలో విద్యుత్ కనెక్షన్ ఉందా.. లేదా,ఇంటిలో నివాసం ఉంటున్నారా..లేదా..ఇంటి స్వరూపం ఏమిటి, ఇల్లు పగుళ్లకు ఏమైనా గురైయిందా తదితర వివరాలను సేకరిస్తున్నారు. చేస్తున్నారు.

వారంలో నివేదిక ఇవ్వాలి..
డేంజర్ జోనో ఫీల్డ్ ఎంక్వైరీ కోసం తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది,తాడిచెర్ల గ్రామ పంచాయతీ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాన్ని నియమించారు. ఫీల్డ్ ఎంక్వైరీ పూర్తిచేసి ఏడు రోజుల్లోపు నివేదికను సబ్ కలెక్టర్ కాటారం కార్యాలయానికి సమర్పించాల్సిందిగా తహసీల్దార్ కు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఉన్నతాధికారుల నుంచి డేంజర్ జోన్ సర్వే కోసం 1204 ఇండ్లను క్షుణ్ణంగా మోకా సర్వే చేయాలని ఆదేశించారు. శుక్రవారం వరకు 400 ఇండ్ల సర్వే పూర్తియినట్లుగా తెలుస్తోంది.

డేంజర్ జోన్ పూరి సమాచారం ఇలా..
డేంజర్ జోన్లో మొత్తం 2,472 ఇండ్లు ఉండగా ఇందులో 1,272 ఆన్లైన్ ఈ పంచాయతీలో నమోదై ఇంటి బిల్లులు చెల్లిస్తున్నట్లుగా తెలుస్తోంది. మిగతా 1200 ఇండ్లు నమోదు కాలేదని తెలుస్తోంది. అయితే సర్వేలో మాత్రం 2010-12లో ఏపి జెన్కో కంపెనీ ఇంటి నెంబర్లు వేసిన 1088 ఇండ్లను మాత్రమే సర్వే చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -