- Advertisement -
– అత్యవసరానికి ప్రజల ఇబ్బందులు
నవతెలంగాణ-బెజ్జంకి : మండలానికి కేటాయించిన 108 అంబులెన్స్ సేవలు తరుచూ బ్రేక్ డౌన్ అవుతున్నాయనే ప్రశ్నలు ప్రజల్లో తలెత్తున్నాయి.రాష్ట్ర రాజీవ్ రహదారిపై తరుచూ చోటుచేసుకునే రోడ్డు ప్రమాదాలు,అయా గ్రామాల్లోని ప్రజలకు తలెత్తే అత్యవసర అనారోగ్య పరిస్థితుల్లో 108 అందుబాటులో లేకపోవడం..అ అత్యవసరానికి కోహెడ అంబులెన్స్ సిబ్బందిని అందుబాటులోకి తీసుకుంటుడడం వల్ల ఆరోగ్య స్థితిగతులు తారుమారవుతున్నాయని పలువురు వాపోతున్నారు. అత్యవసరానికి 108 సేవలు ప్రజలకు అందుబాటులో ఉండేలా యాజమాన్యం చొరవచూపాలని శుక్రవారం ప్రజలు కోరారు.
- Advertisement -



