నవతెలంగాణ – దర్పల్లి
ధర్పల్లి మండల కేంద్రంలో బంజారా భవన్ లో హోలీ లింగి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శశాంక్ ఫౌండేషన్ డాక్టర్ మోతిలాల్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటగా సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి, కొబ్బరికాయలు కొట్టి, గోగు పువ్వులు సమర్పించి హోలీలెంగి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంజారాలు అంటే ప్రకృతి ప్రేమికులు, ప్రకృతిలో కలిసి ఉండేవారు. కావున వేసవికాలంలో అన్ని చెట్టు రాలిపోయిన గోగుపువ్వు ఎలా కాస్తుందో బంజారా లు కూడా అలా ఎల్లప్పుడూ వికసిస్తూనే ఉంటారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోతిలాల్, మండల అధ్యక్షుడు మంగిత్య నాయక్, మరియు 24 తండాల బంజారా సోదరులు సోదరీమణులు పాల్గొన్నారు.
ధర్పల్లిలో ఘనంగా హోలీ లింగి కార్యక్రమం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



