Thursday, March 5, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాజ్యసభ సభ్యునిగా వేం నరేందర్ రెడ్డి పేరు పట్ల హర్షం

రాజ్యసభ సభ్యునిగా వేం నరేందర్ రెడ్డి పేరు పట్ల హర్షం

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ నెల్లికుదురు మండల శాఖ అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్
నవతెలంగాణ – నెల్లికుదురు 

రాష్ట్ర ప్రభుత్వ సీఎం సలహాదారుడుగా ఉన్న వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ పేరు ఖరారు చేయడం పట్ల హర్ష వ్యక్తం ప్రకటిస్తున్నట్టు ఆ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షుడు గూగులోతు బాలాజీ నాయక్, మాజీ జెడ్పిటిసి హచ్ వెంకటేశ్వర్లు , తెలిపారు. మండల కేంద్రంలోని అంబేదర్ సెంటర్ వద్ద ఆ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో నాయకులతో కలిసి గురువారం సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచేందుకు వేం నరేందర్ రెడ్డి కి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఉందని అన్నారు.

ఆయనతో ఈ ప్రాంతంలో ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏర్పడతాయని అన్నారు. ఆయనకు రాజ్యసభ సభ్యుడు అవకాశం ఈ ప్రాంత వ్యక్తికి దొరకడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. గతంలో ఎమ్మెల్యేగా ఈ ప్రాంతాన్ని పరిపాలించాలని మరియు సీఎం సలహాదారుడిగా ఇప్పుడు ఉంటూ రాజ్యసభకు ఎంపీ కావడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, నాయిని శ్రీపాల్ రెడ్డి, నాయకులు ఇట్టే  దేవేందర్ రెడ్డి , మధు సంబమూర్తి, గోగుల మల్లయ్య, పెరుమాండ్ల జగన్ బాబు, నెల్లికుదురు టౌన్ అధ్యక్షులు రత్నపూరం యాకన్న , నెల్లికుదురు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎడ్ల ఆగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -