– హైదరాబాద్లోనూ సోదాలు
ముంబయి: పలు బ్యాంక్లను వేల కోట్ల రూపాయలకు ముంచిన మోసం కేసులో రిలయన్స్ గ్రూప్ చైర్మెన్ అనిల్ అంబానీ కంపెనీలపై ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను మరింత వేగవంతం చేసింది. శుక్రవారం ముంబయి, హైదరా బాద్లలోని అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ లిమిటెడ్పై ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈ రెండు నగరాల్లో కంపెనీ, దాని అధికా రులకు సంబంధించిన దాదాపు 10-12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్లు ఇడి వర్గాలు వెల్లడిం చాయి. ఈడీకి చెందిన చెందిన సుమారు 15 బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయని పేర్కొంది.
అంబానీకి అనుబంధంగా ఉన్న కంపెనీలపై నమోదైన బ్యాంక్ రుణ మోసం కేసు (ఫ్రాడ్), మనీ లాండరింగ్ కేసుతో పాటు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘనలపై ఇడి దృష్టి సారించింది. అనిల్ అంబానీ ఆర్థిక అక్రమాలపై జరుగుతున్న విస్తృత విచారణలో భాగంగా ఈ దాడులు జరిగాయి. కాగా.. తమకు తెలిసినంత వరకు తమ కార్యాలయాల్లో ఎలాంటి సోదాలు జరగలేదని రిలయన్స్ పవర్ ఓ ప్రకటనలో పేర్కొనడం విశేషం.
66 ఏండ్ల అంబానీని మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ విచారణలో భాగంగా ఈడీ ఇప్పటికే రెండుసార్లు ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అనిల్ ధీరూభారు అంబానీ గ్రూప్ కంపెనీలపై ఉన్న కేసులను పరిశీలించేందుకు ఈడీ ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
బ్యాంక్ రుణాల మోసం కేసులో ఫిబ్రవరి చివరి వారంలోనూ ఒకే రోజున అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ఎదుర్కోవడంతో పాటు, ఇటు సీబీఐ నమోదు చేసిన కొత్త బ్యాంకు మోసం కేసులో అంబాని నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. దాదాపు రూ. 40,000 కోట్ల భారీ బ్యాంకింగ్, మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీ ఇటీవల ఢిల్లీ లోని ఈడీ కార్యాలయంలో రెండో విడత విచారణకు హాజర య్యారు. తాజా పరిణామాలు కార్పొరేట్, బ్యాంకింగ్ రంగాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
రిలయన్స్ పవర్పై ఈడీ దాడులు
- Advertisement -
- Advertisement -



