- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులను గత ప్రభుత్వం పదేళ్లు పట్టించుకోలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ‘‘పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటి సోర్సును మార్చివేసి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారు. కాళేశ్వరంలో చేసిన పొరపాటే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో చేశారు. ఎంత ఖర్చయినా సరే.. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. వచ్చే రెండేళ్లలో రూ.22వేల కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు.
- Advertisement -



