Sunday, June 1, 2025
E-PAPER
Homeజాతీయంఅవినీతి, హింసలో కూరుకుపోయిన బెంగాల్‌

అవినీతి, హింసలో కూరుకుపోయిన బెంగాల్‌

- Advertisement -

– ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న మోడీ
– దమ్ముంటే రేపే ఎన్నికలు పెట్టాలన్న మమత
– ఆపరేషన్‌ సిందూర్‌తో తగిన బుద్ధి చెప్పామన్న ప్రధాని
పాట్నా, గ్యాంగ్‌టక్‌, కోల్‌కతా:
అవినీతి, హింస, అక్రమాలు, కుంభకోణాల్లో పశ్చిమ బెంగాల్‌ కూరుకుపోయిందని ప్రధాని నరేంద్ర మోడీ గురువారం తీవ్రంగా విమర్శించారు. వక్ఫ్‌్‌్‌ చట్టానికి సవరణలపై నిరసనల సందర్భంగా ముర్షిదాబాద్‌, మాల్దాల్లో జరిగిన మతోన్మాద హింసను ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. రాష్ట్రంలో ప్రజల ఇబ్బందుల పట్ల తృణమూల్‌ ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా వ్యవహరించిందో దీన్ని బట్టి అర్ధమవుతోందని అన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకున్న టీచర్ల రిక్రూ ట్‌మెంట్‌ కుంభకోణం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ కుంబ óకోణం కారణంగా 25వేల మందికి పైగా టీచర్లు తమ ఉద్యోగాలను కోల్పో యారని అన్నారు. ఈ కుంభకోణానికి కారణం ప్రభుత్వ అవినీతేనని అన్నారు. ఈ అవినీతి, కుంభకోణాలతో విసిగిపోయిన ప్రజలు రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకుంటున్నారని మోడీ వ్యాఖ్యానించారు. రూ.1010 కోట్ల విలువచేసే నగర గ్యాస్‌ పంపిణీ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. అభి వృద్ధి చెందిన దేశంగా భారత్‌ మారాలంటే పశ్చిమ బెంగాల్‌ అభివృద్ధి చాలా కీలకమని వ్యాఖ్యానించారు. రూ.69వేల కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గురు, శుక్రవారాల్లో పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, సిక్కిం, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో పర్యటిస్తు న్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్దూర్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు. ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రస్తావిస్తూ సైనిక బలగాల సామర్ధ్యాలను ప్రశంసించారు. మన అక్కచెల్లెళ్ళ సిందూరాలను ఉగ్రవాదులు చెరిపేశారు, ఆ సిందూరం శక్తి ఏమిటో మన సైనికులు వారికి రుచి చూపించారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. పాకిస్తాన్‌ కనీసం కల్లో కూడా ఊహించేలని రీతిలో వారి లక్ష్యాలను, ఉగ్రవా దుల స్థావరాలను మనం మట్టుబెట్టామన్నారు. ఉగ్రవాదు లకు ఆశ్రయం ఇవ్వడం తప్ప పాకిస్తాన్‌ ఇప్పటివరకు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.
తగు రీతిలో జవాబిచ్చాం
దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలతో బీభత్సాన్ని సృష్టించిన వారికి ఆపరేషన్‌ సిందూర్‌ పేరుతో తగిన రీతిలో ఘాటుగా జవాబిచ్చామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరులో దేశం ఒక్క తాటిపై వుందని స్పష్టం చేశారు. సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. సిక్కిం రాష్ట్ర అవతరణ స్వర్ణోత్సవాలకు ప్రధాని హాజరు కావాల్సి వుంది, అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆ కార్యక్రమం రద్దైంది. బెంగాల్‌లోని బగ్దోగ్రా నుండే పల్జోర్‌ స్టేడియంలోని ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. సిక్కిం రాష్ట్రం దేశానికి గర్వకారణమని ఆయన వ్యాఖ్యానించారు. సిక్కిం ప్రజలకు ప్రజాస్వామ్యంలో విశ్వాసముందని అన్నారు. సాహసోపేతమైన క్రీడలకు సిక్కింలో చాలా అవకాశాలు వున్నాయని, వాటికి ఒక కేంద్రంగా రాష్ట్రం మారాలని ఆయన ఆకాంక్షించారు. అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా కూడా ఆవిర్భవించాలని మోడీ వ్యాఖ్యానించారు.
పాట్నాలో ప్రధాని రోడ్‌ షో
గురువారం సాయంత్రం పాట్నాలో పెద్ద ఎత్తున జరిగిన రోడ్‌ షోలో వేలాదిమంది ప్రజలు పాల్గొన్నారు. త్రివర్ణపతాకాలతో, దేశభక్తి నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. రోడ్డుకిరువైపులా ప్రజలు బారులు తీరి నిల్చుండగా, వారికి అభివాదం చేస్తూ ప్రధాని వాహనంలో ముందుకు సాగారు. ఆ తర్వాత పాట్నా విమానాశ్రయంలో రూ.1200కోట్లతో నిర్మించిన కొత్త టెర్మినల్‌ను ప్రధాని ప్రారంభించారు.
ప్రధాని వ్యాఖ్యలపై మమత సవాల్‌
రాష్ట్ర ప్రజలు ప్రభుత్వం వెంటే వున్నారని, వుంటారని, ధైర్యం వుంటే, రేపే బెంగాల్‌ ఎన్నికలు నిర్వహించాలని ఎవరు గెలుస్తారో చూద్దామని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానిని సవాల్‌ చేశారు. ఒకపక్క అఖిల పక్ష బృందాలు విదేశాల్లో పర్యటిస్తూ ఉగ్రవాదంపై భారత్‌ సమైకంగా వుందనే సందేశాన్ని చాటిచెబుతూ వుంటే స్వదేశంలో మోడీ ఇలా రాష్ట్రాలపై దాడిచేయడం ఎంతవరకు సబబు అని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఆపరేషన్‌ సిందూర్‌ను రాజకీయం చేస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రధానికి నిజంగా నిజాయితీ వుంటే పహల్గాం దాడి వెనుక గల ఉగ్రవాదులను ఇంతవరకు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -