- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇటీవల ఎంజీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు దక్షిణాది సినీ పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. ‘కత్తి కాంతారావు జాతీయ అవార్డు’ ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన, కాంతారావు పేరు చెబితేనే ఎంజీఆర్ భయపడేవారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నటుడు, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ తీవ్రంగా స్పందిస్తూ, ఒక మహానుభావుడిని పొగిడేందుకు మరొకరిని కించపరచడం సరికాదని, ఇది తమిళ ప్రజల మనోభావాలను గాయపరిచిందని అన్నారు. రాజేంద్ర ప్రసాద్ వెంటనే క్షమాపణ చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు.
- Advertisement -



