- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశంలో కమర్షియల్ LPG కొరత ప్రభావం హోటల్ బిల్లులపై పడుతోంది. చెన్నైలోని ఓ రెస్టారెంట్లో ఇడ్లీ, వడ ధరలతో పాటు బిల్లులో ప్రత్యేకంగా ‘గ్యాస్ ఛార్జ్’ పేరుతో రూ.10 వసూలు చేయడం వైరల్ అయింది. బెంగళూరులో కూడా ఓ హోటల్ గ్యాస్ కొరత సాకుతో రూ.30 అదనంగా తీసుకున్న ఘటన బయటపడింది. కస్టమర్లు బిల్లులను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. ఇకపై హోటళ్కు వెళ్తే GSTతో పాటు గ్యాస్ బిల్లు భారం మోయక తప్పదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
- Advertisement -



