Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్య లక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఆరోగ్య లక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి

- Advertisement -

సర్పంచ్ కోడిపెల్లి పద్మరాము
నవతెలంగాణ – కాటారం

ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య లక్ష్మి పథకాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని దామెరకుంట గ్రామ సర్పంచ్ కోడిపెల్లి పద్మరాము సూచించారు. శుక్రవారం దామెరకుంట గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోడిపెల్లి పద్మరాము మాట్లాడుతూ.. మూడు నుండి ఆరు సంవత్సరాల వయస్సు గల పిల్లలను తప్పనిసరిగా ప్రీ స్కూల్ కార్యక్రమాలకు పంపించాలని తల్లిదండ్రులకు సూచించారు. అంగన్వాడి కేంద్రాల ద్వారా అందించే గుడ్లు, పాలు, బాలామృతం వంటి పోషకాహారాన్ని పిల్లలు తీసుకోవడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. తల్లిదండ్రులు అంగన్వాడి సేవలను పూర్తిగా వినియోగించుకోవాలని కోరారు.

కార్యక్రమం అనంతరం సర్పంచ్ కోడిపెల్లి పద్మరామును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం విజయలక్ష్మి, అంగన్వాడి టీచర్ వసుమతి, ఆయా సునీత, ఆశా కార్యకర్తలు సంధ్యా, శైలజ, వసంత, సిఏలు శంకరవర్ణ, వాణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -