- Advertisement -
నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని నేరల్ గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బ తండలో ఎన్ ఆర్ ఈ జి ఎస్ రూ.10 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక నాయకులతో కలిసి నేరల్ సర్పంచ్ రాథోడ్ దేవి సింగ్ సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ చిన్న సాయిలు, వార్డు సభ్యులు బాలు ,ఎస్.కె అయూబ్, హరిజనసాయిలు, మాజీ ఉపసర్పంచ్ నానాక్ సింగ్, హరి సింగ్ మహారాజ్ జోర్మల్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -


