నవతెలంగాణ – ఆలేరు టౌను
ఆలేరు పట్టణంలో రోడ్ల పైన వెలిసిన బోర్డులను ఎట్టకేలకు మున్సిపల్ అధికారులు శనివారం తొలగించారు. మున్సిపల్ పరిధిలోని మెయిన్ రోడ్డుకు ఇరువైపుల షాపుల ముందు ఉన్న బోర్డులను పరిశిలించి వాహనదారులకు, పాదచారులకు, ట్రాఫిక్ కు అంతరాయంగా ఉన్న బోర్డులను వెంటనే తొలగించాలని కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి దుకాణ యజమానులకు సూచించారు. తొలగించే కార్యక్రమంను కమిషనర్ కే.శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు. షాపుల యజమానులు రోడ్డుకు అడ్డుగా ఎటువంటి బోర్డు పెట్టకుండా ఉండాలని, మున్సిపల్ సిబ్బందికి సహకరించ వలసినదిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ బి.జగన్ మోహన్, శానిటేషన్ సూపర్ వైజర్లు పి ప్రసాద్, ఏ శివ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
రోడ్లపై వెలసిన బోర్డులను తొలగించిన మున్సిపల్ అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


