Sunday, March 15, 2026
E-PAPER
Homeబీజినెస్అమెరికా మార్కెట్లపై బేర్‌ పంజా

అమెరికా మార్కెట్లపై బేర్‌ పంజా

- Advertisement -

చమురు ధర బ్యారెల్‌కు 102 డాలర్లకు పెరుగుదల
మందగిస్తున్న యూఎస్‌ ఆర్థిక వ్యవస్థ
వాషింగ్టన్‌:
ఇరాన్‌తో యుద్ధం కారణంగా చమురు ధరలు విపరీతంగా పెరగడంతో అమెరికా వాల్ట్‌ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో కూరుకుపోయాయి. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 0.61 శాతం క్షీణించింది. ఉదయం 0.9 శాతం లాభంతో మొదలైనప్పటికీ మధ్యాహ్నానికి మళ్లీ పతనమైంది. డౌ జోన్స్‌ 119 పాయింట్లు తగ్గగా, నాస్డాక్‌ 1 శాతం వరకు క్షీణించింది. వరుసగా మూడు వారాలు మార్కెట్లు నష్టపోయాయని పలువురు అమెరికన్‌ ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు.
పెరిగిన చమురు ధర..
అంతర్జాతీయ ప్రమాణ చమురు ధర బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ కు 101.76 డాలర్లకు చేరింది. ఇది ఈ నెలలో 39 శాతం పెరుగుదల. అమెరికా క్రూడ్‌ ఆయిల్‌ (డబ్లూటిఐ) 96.59 డాలర్లకు పెరిగింది. ఈ నెలలో 44శాతం పెరగటం గమనార్హం. ఇరాన్‌ హర్మూజ్‌ జలసంధిó మూసివేత ఇలానే కొనసాగితే, చమురు ధర బ్యారెల్‌కు 150డాలర్లకు చేరుకోవచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వినియోగదారుల ఆందోళన
అమెరికా కామర్స్‌ డిపార్ట్‌మెంట్‌ నివేదిక ప్రకారం.. జనవరిలో ధరలు 2.8శాతం పెరిగాయి. ఆహారం, ఇంధనం మినహాయించిన కోర్‌ ధరలు 3.1 శాతానికి చేరాయి. ఇది రెండేళ్ళలో అత్యధికం. యుద్ధం తర్వాత నూనె, గ్యాస్‌ ధరలు మరింత పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం ఇంకా ముదరవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పెరిగిన ధరలతో అమెరికన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్‌ విధానాలపై, యుద్ధానికి వ్యతిరే కంగా నిరసనలు తెలుపుతున్నారు.
ఆందోళనకరంగా జిడిపి..
గతేడాది అక్టోబర్‌, డిసెంబర్‌ త్రైమాసికంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి 0.7 శాతానికి మందగించింది. 43 రోజుల ప్రభుత్వ షటౌన్‌ దీనికి ముఖ్య కారణమని నిపుణులు చెప్తున్నారు. అయితే పశ్చిమాసియాలో యుద్ధం నేపధ్యంలో ఇది మరింత ఆందోళన కలిగిస్తోందని అని నార్త్‌ అసెట్‌ మేనేజ్మెంట్‌ సిఐఒ క్రిస్‌ జాకరెల్లీ అన్నారు. గ్లోబల్‌ మార్కెట్లలో వరుసగా మూడవ వారం కూడా నష్టాలు కొనసాగుతుండటంతో ఇన్వెస్టర్లు బెంబేలెత్తుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -