- Advertisement -
34 పైసలు పతనమై రూ. 96.59లకు..
ముంబయి : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో రూపాయి మారకం విలువ మరింత పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు భగ్గుమంటుండటం, భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా బుధవారం అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 34 పైసలు పతనమై 96.59 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, దేశీయ ఈక్విటీ మార్కెట్లలోని బలహీన ధోరణి మదుపర్ల సెంటిమెంట్ను దెబ్బతీశాయని ఫారెక్స్ వర్తకులు వెల్లడించారు.
- Advertisement -



