నవతెలంగాణ – మిడ్జిల్
మండలంలోని 24 గ్రామపంచాయతీలలో 60 వేల గొర్రెలు , పదివేల పందులు, 5000 కుక్కలు, 33 మంది గొర్రె కాపరులు ఉన్నారు. మండల కేంద్రాల్లో ఒక పశు వైద్య కేంద్రాల్లో ఒకే డాక్టరు ఉండడంతో రైతులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, వైద్యం అందక మూగజీవాలు రోగాల బారిన పడి చనిపోతున్నాయని మండలంలోని వివిధ సబ్ సెంటర్లలో వైద్య డాక్టర్లను నియమించాలని రాష్ట్ర పశువైద్య, శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తకు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెరుమళ్ళ జంగయ్య, బరిగల బాలయ్య, బుచ్చయ్య భీమయ్య వెంకటయ్య మల్లయ్య, రామస్వామి, నందం మురళి తదితరులు ఆదివారం అభివృద్ధి పనుల కోసం బోయిన్పల్లి గ్రామానికి వచ్చిన మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు.
మండలంలో మూగజీవాలు ఎక్కువగా ఉండడంతో వైద్యం వందకు రోగాల పాడిన పడి చనిపోతున్నాయని వివరించారు. మిడ్జిల్ , కొత్తపల్లి ,బోయిన్పల్లి, పశు ఉపకేంద్రాల్లో ఉన్న సిబ్బంది లేక రైతులు సిబ్బంది లేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. వేముల ,దోనూరు అయ్యవారిపల్లి గ్రామాలలో పరిశు వైద్యశాలను నిర్మించి ప్రతి సెంటర్కు ఒక డాక్టర్ను ఒక అటెండర్ను నియమిస్తే మండలంలో గణనీయంగా పాల ఉత్పత్తి పెరిగి పరిపాలన సౌకర్యంగా ఉంటుందని కోరారు. ఉమ్మడి మిడ్జిల్ మండలం నుండే రాజకీయం ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేయాలని కోరారు.



