- Advertisement -
విశేష స్పందన
నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన, ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం తాడిచెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో డెంటల్ 9, ఆప్తలిక్ 35, ఆర్థో పెడిక్ 61, జనరల్ మెడిసిన్ 95, పిడియాట్రిక్ 21, గైనిక్ 35, మొత్తం 256 మంది రోగులకు వివిధ రకాల టెస్టులు నిర్వహించి, మందులపంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



