టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్కుమార్ గౌడ్ తెలిపారు. గురువారం హైదరాబాద్లోని గాంధీభవన్లో ఉగాది పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణాన్ని చిలుకూరు శ్రీనివాస్ మూర్తి చేశారు. వేద పండితులు మహేశ్కుమార్ గౌడ్ను ఆశీర్వదించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు కలగాలనీ, ప్రజలు సుఖ శాంతులతో ఉండేలా భగవంతులు ఆశీస్సులు ఉండాలన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ఎంతో శ్రమించి అద్భుతమైన పాలన అందిస్తున్నారని అభినందించారు.
పరాభవ నామ సంవత్సరంలో ఎవరు ఎవర్ని పరాభవం చేయకుండా అంత కలిసి కట్టుగా సుఖ శాంతులతో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందే విదంగా నాయకులు కృషి చేయాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు ఈ ఏడాది బడ్జెట్ ఆమోదయోగ్యంగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరు విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
అన్ని హామీలు నెరవేర్చేందుకు కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



