- Advertisement -
నవతెలంగాణ- ఆర్మూర్
పట్టణానికి చెందిన సామాజిక సేవకులు జాతీయ అవార్డు గ్రహీత పట్వారి తులసి కుమార్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠిని శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. రిటైర్డు ఐ.ఏ.స్ విక్రమ్ సింహ రావు రూపొందించిన యువత మానసిక నైపుణ్యాలు లక్ష్యాలు వంటి అంశాలతో ఉన్న పుస్తకాన్ని కలెక్టర్ కు అందజేశారు. తను చేస్తున్న సామాజిక సేవలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నేటి యువతకు చేస్తున్న సేవలకు గానూ ఆయనను అభినందించారు.
- Advertisement -



