నవతెలంగాణ – అచ్చంపేట
రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం మైనార్టీ కుటుంబాలకు రంజాన్ తోఫాను అమ్రాబాద్ మండలం వటవర్లపల్లి మాజీ సర్పంచ్ చత్రు నాయక్ 15 కుటుంబాలకు 9 రకాల సరుకులను పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఆదేశాల మేరకు తొమ్మిది రకాల సరుకులతో కూడిన రంజాన్ తోఫాను పంపిణీ చేశారు. 2019లో కరోనా వచ్చినప్పటినుండి ప్రతి సంవత్సరము గ్రామంలో ఉన్న ముస్లిం మైనార్టీ కుటుంబాలకు రంజాన్ తోఫాలను ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ లక్ష్మణ్, ఉమామహేశ్వర డైరెక్టర్ పవన్, యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జబ్బు వెంకట్ యాదవ్, అజీమ్, వటవలపల్లి గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జాంగిర్ పాష, నిరంజన్, సాధిక్, శ్రీను, సాయి, కరీం సలీం, ముస్లిం, మైనార్టీ, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
పేద ముస్లీం కుటుంబాలకు సరుకులు పంపిణీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



