- Advertisement -
నవతెలంగాణ – కోటగిరి : విద్యుత్ ఘాతకంతో రెండు ఆవులు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం సుద్దులం గ్రామంలో చోటుచేసుకుంది. సుద్దులం గ్రామానికి చెందిన గోపు బంగారి అనే వ్యక్తి గురువారం తన పాడి ఆవులను వేపెందుకు తీసుకెళ్తుండగా గ్రామ శివారులో రోడ్డుకు అనుకోని ఉన్న గల సింగిల్ ఫేస్ డిటిఆర్ వద్ద కరెంట్ షాక్ తగిలి లక్షన్నర విలువ చేసే రెండు పాడి ఆవులు అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షం మరోవైపు రోడ్డు ప్రక్కనే ఆనుకొని ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది.
- Advertisement -



