- Advertisement -
నవతెలంగాణ-రెంజల్
రెంజల్ మండలం పేపర్ మిల్లు గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం సర్పంచ్ జుబేర్ అధ్యక్షతన జలసిరి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎల్ నిఓ ప్రభావంతో వర్షాపాతం గణనీయంగా తగ్గిపోవడం భూగర్భ జలాలు తగ్గిపోకుండా ముందు జాగ్రత్తగా ప్రతి ఇంటికి ఇంకుడు గుంతలను, ఫామ్ ఫండ్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. బోర్ వెల్ రీఛార్జి గుంతలు, సోపిట్ గుర్తించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అఫ్జల్ ఖాన్, పాలకవర్గ సభ్యులు డెవలత్ ఖాన్, రమేష్ సోన్ కాంబ్లే, గ్రామ కార్యదర్శి రామిరెడ్డి, మేట్ నసీర్, అంగన్వాడి కార్యకర్త పద్మ, ఆశా వర్కర్లు ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.
- Advertisement -



