- Advertisement -
నవతెలంగాణ-రెంజల్
వర్షాలు సమృద్ధిగా పడుతుండడంతో రెంజల్ మండలం అంబేద్కర్ నగర్ సర్పంచ్ మాధవ్ వాగ్మా రే ఇంటింటికి మొక్కలను పంపిణీ చేశారు. పండ్ల మొక్కలు, పూల మొక్కలు తమ ఇంటి ముందు పెరట్లో ప్రతి ఒక్కరు నాటాలని ఆయన సూచించారు. తీసుకున్న మొక్కలను వెంటనే నాటినట్లయితే తమ ఇంటి ముందు రకరకాల పూలు పూసే అవకాశం ఉందని, ప్రతి ఒక్కరు ఈ మొక్కలను నాటాలని ఆయన అన్నారు. ఒక్కొక్క ఇంటికి నాలుగు ముక్కల చొప్పున ఇవ్వడం జరిగింది అని ఆయన పేర్కొన్నారు.
- Advertisement -



