Saturday, March 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు 

ఘనంగా రంజాన్ పర్వదిన వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ-గోవిందరావుపేట
ఈద్గాలలో ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని మండల వ్యాప్తంగా శనివారం ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. పసర గ్రామంలో ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పసర 163 వ జాతీయ రహదారి గుండ్ల వాగు పక్కన  ఈద్గాల వద్దకు అధిక సంఖ్యలో ముస్లిం సోదరులు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగం చేసుకుని అలై బలై చెబుతూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఈ సందర్భంగా పలువురు ముస్లిం పెద్దలు మాట్లాడుతూ.. ప్రేమ, సోదర భావం, శాంతికి చిహ్నమే రంజాన్ పర్వదినమన్నారు. ప్రతి ఏడాది హిందూ, ముస్లిం సోదరులు కలిసి ఇక్కడ రంజాన్ పర్వదినాన్ని జరుపుకొని మతసామరస్యాన్ని చాటుకోవడం స్ఫూర్తిదాయకమన్నారు. 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు ఉండి అల్లా అనుగ్రహం పొందుతారని తెలిపారు. ఆ అల్లా చల్లని దీవెనలతో చక్కగా వర్షాలు కురిసి, పంటలు సమృద్ధిగా పండి ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

పసర పోలీసులు ముస్లింల మత ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన, ఆధ్యాత్మిక వాతావరణంలో రంజాన్ వేడుకలను జరుపుకున్నారు.

శుభాకాంక్షలు తెలిపిన పసర సర్పంచ్ భూక్య సుమలత రంజాన్ పండుగ సందర్భంగా పసరాలోని ఈద్గా వద్దకు చేరుకుని సర్పంచ్ బుఖ్యాసమలత సర్పంచ్, ఉప సర్పంచ్ సప్పిడి సంజనా రెడ్డిలు  ఈద్ ముబారక్ తెలిపారు. ప్రార్థన ప్రదేశంలో సర్పంచ్ చేసిన హిందీ ప్రసంగం పలువురిని ఆకట్టుకుంది. అనంతరం ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలుపుతూ సర్పంచ్ ఉప సర్పంచ్ లు మిఠాయిలు పంపిణీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -