- జిల్లా వైద్యాధికారి రవికుమార్
నవతెలంగాణ-వెల్దండ: ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అమలు చేస్తున్న ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ఆరోగ్య మిషన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రజలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.కె.రవికుమార్, వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అన్నారు. మంగళవారం వెల్దండ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ క్యాంపు ప్రారంభించారు. ఈ సందర్భంగా శిబిరంలో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించి, రోగులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్నారు. జిల్లా ఆసుపత్రి నుంచి వచ్చిన స్త్రీరోగ నిపుణులు, శిశు వైద్యులు, ఎముకల వైద్యులు, కంటి వైద్యులు, దంత వైద్యులు, జనరల్ ఫిజీషియన్లు పాల్గొని వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స, మందులను అందించారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు వారి గ్రామాల వద్దే అందుబాటులోకి వస్తున్నాయని వారు పేర్కొన్నారు.
ప్రపంచ క్షయవ్యాధి నియంత్రణ దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం రెండో దశలో భాగంగా, 14 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరికీ TB స్క్రీనింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. టిబి లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, సమయానికి చికిత్స తీసుకుంటే టిబి పూర్తిగా నయం అవుతుందని వివరించారు. ప్రజల్లో టిబి పై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని, టిబి వ్యాధి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సమాజం మొత్తం కలిసి పనిచేస్తేనే టిబిని పూర్తిగా నిర్మూలించగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. భీమానాయక్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ వైద్య బృందం డా.సమీరా, డా. ప్రమోద్, డా.సాయితేజ, డా.లత,డా.స్పూర్తి, డా.ఖదీర్ స్థానిక వైద్యాధికారి డా.సింధు, పర్యవేక్షణ అధికారులు మురళీకృష్ణ, మనోజ్,కవిత, సుమిత, ప్రమోద్, డిస్ట్రిక్ట్ వ్యాక్సిన్ స్టోర్ మేనేజర్ కుమార్,ఉప సర్పంచ్ ఎర్ర.శ్రీనివాస్ ముదిరాజ్, మాజీ ఉప సర్పంచ్ క్యాసరపు వెంకటయ్య, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీధర్, పంచాయితీ కార్యదర్శి గిరి గౌడ్, బయ్య మల్లయ్య, వార్డు సభ్యులు పాలాది మల్లీశ్వరి రంగనాథం, రేవల్లి మనస రాజు, ముదికొండ కవిత రమేష్, పసునోజు వాణి పురుషోత్తం, మారేపల్లి మంజుల శ్రీను, పిల్లి దేవేందర్ ముదిరాజ్, శిరుశనగండ్ల శేఖర్, జంగిలి ఆనంద్,రవీందర్ రెడ్డి, మట్ట భరత్ గౌడ్,రషీద్, కొయ్యల పుల్లయ్య, కృపానందం,బొద్దం కృష్ణ రెడ్డి, ఫార్మసీ ఆఫీసర్ అనిత, ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్, లక్ష్మణ్, గోవర్దన్, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



