Wednesday, March 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబీఆర్‌ఎస్‌ గ్యారెంటీలేవి అమలు చేయలేదు

బీఆర్‌ఎస్‌ గ్యారెంటీలేవి అమలు చేయలేదు

- Advertisement -

బడ్జెట్‌పై చర్చలో కాంగ్రెస్‌ సభ్యులు మధన్‌మెహన్‌రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదని కాంగ్రెస్‌ సభ్యులు మదన్‌ మోహన్‌రావు విమర్శించారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామనం గ్యారెంటీ కాదా? దళితులకు మూడెకరాలు ఇస్తామనడం గ్యారెంటీ కాదా? ఇలా ఎన్నో గ్యారంటీలు ప్రజలకు ఇచ్చిన మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం శాసనసభలో బడ్జెట్‌ చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటుతగ్గిందనడం సరైందికాదన్నారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుందని చెప్పారు. హైదరాబాద్‌ ను మినహా ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రుణ భారాన్ని తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేస్తుందని తెలిపారు. అటువంటి పురోగతి దిశ కొనసాగుతున్నదని చెప్పారు. సమగ్రమైన ప్రణాళికలతోనే రాష్ట్రాభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు. ఈ బడ్జెట్‌ ఆ దిశగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -