- Advertisement -
నవతెలంగాణ – తొగుట
గ్రామాభివృద్ధికి అందరు సహకరించాలని సర్పంచ్ రాంపురం రమేష్ అన్నారు. మంగళవారం మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో జిపిడిపి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఉన్న సమస్యలను వీలై నంత త్వరగా పూర్తి చేస్తానని అన్నారు. పై అధికా రుల దృష్టికి తీసుకువెళ్తానని, గ్రామ అభివృద్ధి కి కృషి చేస్తానన్నారు. ఈ గ్రామసభలో ఉపసర్పంచ్ ఎండి గౌస్ బాషా, వార్డు సభ్యులు గౌరోల్ల సాయి కుమార్, నరేడ్ల బాల్ రెడ్డి, నిరటి నవనీత, బుర్ర భారతి, పంచాయతీ కార్యదర్శి జగన్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



