- Advertisement -
నవతెలంగాణ-భిక్కనూర్ ( రాజంపేట్ ) : రాజంపేట్ మండలంలోని శివాయిపల్లి గ్రామంలో బుధవారం సీసీ రోడ్డు పనులను సర్పంచ్ సంధ్య బాలరాజ్ ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించినందుకు గ్రామస్తులు తరఫున ధన్యవాదాలు తెలుపుతు ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
- Advertisement -



