– ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపిన మండల నాయకులు
నవతెలంగాణ – దర్పల్లి : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా విద్యాభివృద్ధిపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు సన్నగ్ధం అవుతుంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రూరల్ నియోజకవర్గంలోని దర్పల్లి మండల కేంద్రానికి కేటాయించడం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు హర్షం వెక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమములో దర్పల్లి సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మహేందర్, సురేందర్, మురళి, డీబి తండా మాజీ సర్పంచ్ నరేందర్,తదితరులు పాల్గొన్నారు.



