నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్లో గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. గ్యాస్ కొరత వల్ల వ్యాపారాలు, ప్రధానంగా హోటళ్లు మూతపడ్డాయి. గృహ వినియోగదారుల సమస్య అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్యాస్ కంపెనీల వద్ద సిలిండర్ల కోసం జనాలు బారులుతీరుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశ ఇంధన సరఫరా పూర్తిగా సురక్షితంగా, స్థిరంగా ఉందని పెట్రోలియం మంత్రిత్వశాఖ గురువారం స్పష్టం చేసింది. దేశంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ ఎల్పిజి గ్యాస్ కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రస్తుతం అన్ని రిటైల్ దుకాణాలు తగినంత సరఫరాలతో సాధారణంగా పనిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పిజిల కొరత ఉందనేది తప్పుడు సమాచారం. ఇలాంటి భయాందోళనలను సృష్టించే కథనాలు పూర్తిగా నిరాధారమైనవి. పౌరులు అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, వదంతులు వ్యాప్తి చేయకుండా ఉండాలని మంత్రిత్వశాఖ సూచించింది.
దేశంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ ఎల్పిజి గ్యాస్ కొరత లేదు:
నవతెలంగాణ-హైదరాబాద్: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్లో గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. గ్యాస్ కొరత వల్ల వ్యాపారాలు, ప్రధానంగా హోటళ్లు మూతపడ్డాయి. గృహ వినియోగదారుల సమస్య అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ్యాస్ కంపెనీల వద్ద సిలిండర్ల కోసం జనాలు బారులుతీరుతున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశ ఇంధన సరఫరా పూర్తిగా సురక్షితంగా, స్థిరంగా ఉందని పెట్రోలియం మంత్రిత్వశాఖ గురువారం స్పష్టం చేసింది. దేశంలో ఎక్కడా పెట్రోల్, డీజిల్ ఎల్పిజి గ్యాస్ కొరత లేదని పెట్రోలియం మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రస్తుతం అన్ని రిటైల్ దుకాణాలు తగినంత సరఫరాలతో సాధారణంగా పనిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పిజిల కొరత ఉందనేది తప్పుడు సమాచారం. ఇలాంటి భయాందోళనలను సృష్టించే కథనాలు పూర్తిగా నిరాధారమైనవి. పౌరులు అధికారిక వర్గాల సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని, వదంతులు వ్యాప్తి చేయకుండా ఉండాలని మంత్రిత్వశాఖ సూచించింది.



