నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ : జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని డిఆర్డిఏ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో ఏరిక్సన్ ఇన్సూరెన్స్ టి పి ఏ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సహకారంతో ఉపాధి హామీ పథకం సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరంను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించమని, సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి ఆరోగ్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ అన్నారు. డిఆర్డిఏ సిబ్బందికి ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి విద్య పరీక్షలు నిర్వహించి, సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి నాగిరెడ్డి , జిల్లా విజిలెన్స్ అధికారి మందడి ఉపేందర్ రెడ్డి , అదనపు డి ఆర్ డి ఓ జి సురేష్ రెడ్డి, ఉపాధి హామీ పథకం సిబ్బంది పాల్గొన్నారు.
డిఆర్డిఏ కార్యాలయంలో వైద్య శిబిరంను ప్రారంభించిన కలెక్టర్..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



