- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నేపాల్లో ఆర్ఎస్పీ పార్టీ ఘన విజయం సాధించడంతో, ఆ పార్టీకి చెందిన బాలెంద్ర షా(35) దేశ నూతన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అతి పిన్న వయస్కుడైన ప్రధానిగా, మధేశ్ ప్రాంతం నుంచి ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తిగా బాలెన్ చరిత్ర సృష్టించారు. ఒకప్పుడు ర్యాపర్ గా యువతను ఆకట్టుకున్న బాలెన్, జెన్-జీ తిరుగుబాటుతో సామాజిక, రాజకీయ చైతన్యం నింపి, అనుభవజ్ఞుడైన కె.పి.శర్మ ఓలిని ఓడించి నాయకుడిగా ఎదిగారు. ఆర్ఎస్పీ నేపాల్ పార్లమెంట్లో 182 స్థానాలు కైవసం చేసుకుని పూర్తి మెజారిటీ సాధించింది.
- Advertisement -



