- Advertisement -
నవతెలంగాణ – దర్పల్లి
మండలంలోని చల్లగర్గ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సోమవారము గ్రామ ప్రధాన కూడలిలో తహసీల్దార్ శాంత చలి వేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వేసవిలో ప్రజల దహార్తి తిచెందుకు పంచాయతీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. గ్రామస్థులతోపాటు రహదారిపై వెళ్ళే ప్రజలకు అందుబాటులో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ప్రతిరోజూ పరిశుబరమైన నీటిని ప్రజలకు అందించేందుకు దృష్టి సాధించాలని అన్నారు. కార్యక్రమములో ఎంపీడీఓ లక్ష్మారెడ్డి ,గ్రామ సర్పంచ్ గాదె నరేష్,ఉప సర్పంచ్ మగ్గిడి స్రవంతి,గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



