Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతుల అభివృద్ధే గ్రామాభివృద్ధి 

రైతుల అభివృద్ధే గ్రామాభివృద్ధి 

- Advertisement -

వడ్లు ఆరబోసుకునే ప్రాంతాన్ని, ముళ్ళపదలను తొలగిస్తున్న సర్పంచ్ 
బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ చిర్రా యాకాంతం గౌడ్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 

మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతూనే గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆ గ్రామ సర్పంచ్ చిర్ర యాకాంతం గౌడ్ అన్నారు. ఓరి ధాన్యం ఆరబోసుకునే ప్రాంతాన్ని జెసిబి సహాయంతో మంగళవారం ముండ్ల పొదలను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో రైతులు అహర్నిశలు కష్టపడి పండించిన పంట గిట్టుబాటు ధరకు అమ్ముకోవడం మంచిదని దీనితో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు.

కష్టపడి పండించిన పంటను మార్కెట్ యార్డ్ కు తరలిస్తే అందులో ముళ్ళ కంపలు చెత్తాచెదారం ఉండి ఇబ్బందిగా ఉంటుందని ఉద్దేశంతో జెసిబి సహాయంతో ముండ్లపదలను తొలగించి చదును చేసే కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించామని అన్నారు. ఈ ప్రాంతంలో కోతులు పెడితే ఎక్కువ ఉండి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఉద్దేశంతో చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెట్లను తొలగిస్తున్నామని అన్నారు. అవసరమైతే లైటింగ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలిపినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ప్రజలు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -