Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య శిబిరం

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య శిబిరం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేర్ రూరల్
ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆలేరు మండలం గుండ్లగూడెం గ్రామంలో ఎన్‌సీడీ (సంక్రమించని వ్యాధులు) ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేశారు. ప్రత్యేకంగా ఒపీ, రక్తపోటు, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించి, రోగుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పరిశీలించారు. అవసరమైన వారికి తగిన మందులు పంపిణీ చేసి, ఆరోగ్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హైమావతి,డాక్టర్ మానస,డాక్టర్ సాయి తేజ వైద్య సేవలు అందించారు. గ్రామ ఏఎన్ఎం లక్ష్మి,నిర్మల శిబిరాన్ని సమన్వయం చేశారు. గ్రామ సర్పంచ్ ఏసిరెడ్డి మంజుల మహేందర్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని వైద్యులు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -