- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల వెల్మలపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గత ఆరు సంవత్సరాల మూతబడి ఇటీవల పూర్వ విద్యార్థుల, గ్రామస్తులు సహకారంతో పున:ప్రారంభమైన నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని నాగులమ్మ టాటా మ్యాజిక్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ చేశారు. పాఠశాల రహదారికి అవసరమైన మట్టిని త్వరలోనే పోస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విద్యార్థులకు స్వీట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -



