నవతెలంగాణ – కామారెడ్డి : బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతినీ జిల్లా కలెక్టరేట్లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్దార్ సర్వాయి పాపన్న పోరాటం ప్రతి ఒక్కరికీ స్పూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ధైర్యసాహసాలు, సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అహర్నిశలు కృషి చేసిన మహానేతగా పాపన్నను అభివర్ణించారు. ఆయన జీవితం, సేవలు నేటి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొని పాపన్న సేవలను స్మరించుకున్నారు. జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్, సహాయ బీసీ అభివృద్ధి అధికారి చక్రధర్, గౌడ కుల సంఘ నాయకులు రాజా గౌడ్, వెంకట్ గౌడ్, స్వామి, శాంతయ్య, అశ్వక్, నరేష్, జీవన్, స్వప్న, సునీత, తెలంగాణ కళ్ల గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకట గౌడ్, బీసీ సంఘం నాయకులు నాగరాజు తదితరులు, ఇతర గౌడ సంఘ నాయకులు, జిల్లా అధికారులు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.



