నవతెలంగాణ-హైదరాబాద్: వైట్ హాస్ మీడియా సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ స్పందించింది. తమ దేశ ఆర్మీని, అనుబంధ మౌలిక సదుపాయాలపై దాడులు చేసి ధ్వంసం చేసినట్లు ట్రంప్ చెప్పిన మాటలను ఇరాన్ ఖండించింది. ఇరాన్ దళంపై, తమ వ్యూహాలపై యూఎస్ నిఘా వ్యవస్థకు అవగాహన లేదని ఎద్దేవా చేసింది. అమెరికా పోరుతో ఇరాన్ నిర్భయంగా ఉందని, భారీ స్థాయిలో వారి స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించామని పేర్కొంది.
మా సైనిక శక్తి, పరికరాలపై మీ నిఘా సమాచారం అసంపూర్ణంగా ఉంది. మా విస్తారమైన వ్యూహాత్మక సామర్థ్యాల గురించి మీకు ఏమీ తెలియదు. మా వ్యూహాత్మక క్షిపణి ఉత్పత్తి కేంద్రాలు, సుదూర దాడి, ఖచ్చితత్వ డ్రోన్లు, ఆధునిక వాయు రక్షణ వ్యవస్థలు, ఎలక్ట్రానిక్ యుద్ధం, ప్రత్యేక పరికరాలను మీరు ధ్వంసం చేశారని అసత్యాలు పలుకుతున్నారు, భావించవద్దు.
మీరు దాడి చేశామని అనుకుంటున్న ప్రదేశాలు చాలా అల్పమైనవి, మా వ్యూహాత్మక సైనిక ప్రదేశాలు, మీరు ఎప్పటికీ చేరుకోలేని ప్రదేశాలలో జరుగుతున్ననాయి. తమ ఆయుధా సంపదపై తప్పుడు అంచనాలతో ప్రయత్నించి వృధా చేసుకోండి,అలా చేస్తే మీ లెక్క తప్పుతుంది, దానివల్ల మీరు ఏమీ సాధించలేరు’ అని ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ కథనాలు వెలువరించింది.



