– గ్రామస్తుల ఆందోళన
– గ్రామ సభలో తీర్మానం చేసినా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం
నవతెలంగాణ -చిన్న శంకరంపేట
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలంలోని మిర్చపల్లి గ్రామ శివారులో ఫార్మా వినుత కంపెనీ పెట్టొద్దంటూ గ్రామస్తులు శనివారం ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గతంలో పలుమార్లు ధర్నాలు చేపట్టినా ఫలితం దక్కలేదన్నారు. యజమాన్యం మొండి వైఖరితో ఉండటంతో మరోసారి కంపెనీ వద్ద ధర్నాకు దిగామన్నారు. గ్రామసభలో పలుమార్లు చర్చించి మాకు ఫార్మా కంపెనీ వద్దని తీర్మానం చేశామన్నారు. తీర్మానం చేసి యాజమాన్యానికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ నిర్మాణం ఆపకపోతే పెద్దఎత్తున ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఫార్మా వినుత కంపెనీ మాకొద్దు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



