- Advertisement -
నవతెలంగాణ-నవాబు పేట
మండల కేంద్రములో అనుమతి లేకుండా వెళ్తున్న ఫిల్టర్ ఇసుక టిప్పర్ ను నవాబు పేట పోలీసు కానిస్టేబుల్ రాజు, హోం గార్డ్ కృష్ణ విశ్వసనీయ సమాచారం ప్రకారం శుక్రవారం ఉదయం పట్టుకున్నారు. టిప్పర్ డ్రైవర్ వల్లూరి రామకృష్ణ యజమాని గోవిందుగారి రత్న కుమార్ పై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ నరెందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుమతి లేకుండా ఫిల్టర్ ఇసుక రవాణా చేసే వారిపై చర్యలు కఠినంగా తీసుకుంటామని చెప్పారు.
- Advertisement -



