- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ప్రతి సోమవారం మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని స్తానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మండల అభివృద్ధి అధికారి సాయిలు సూచించారు. ఆగష్టు 24న నిర్వహించిన ప్రజావాణికి మూడు దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమానికి 22 శాఖల అధికారులు హాజరవుతారని చెప్పారు. ప్రజలకు ఏవిధమైన సమస్యలున్నా నేరుగా ప్రజావాణికి వచ్చి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. మీ సమస్యలను తప్పక పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
- Advertisement -



