నవతెలంగాణ – గోదావరిఖని
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని ప్రధాన చౌరస్తాలో అమరవీరుల స్థూపానికి పూలతో అలంకరణ చేయని రామగుండం కార్పొరేషన్ అధికార యంత్రాంగం. రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులను అవమానించడమే దీనికి నిదర్శనమని బెస్ట్ ఫర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ అన్నారు. సకల జనుల సమ్మెకు సింగరేణి కార్మికులు ఏకతాటిపై పోరాటానికి నాంది పలికిన రామగుండం అని ఇలాంటి పోరాటాల నిలయమైన గోదావరిఖని ప్రాంతంలో అమరవీరుల స్థూపానికి అవమానకర సంఘటన జరగడం బాధాకరమని అన్నారు. గోదావరిఖని చౌరస్తా వద్ద నిర్మించిన అమరవీరుల స్థూపానికి పూల అలంకరణ చేయని రామగుండం కార్పొరేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
అమరవీరుల స్థూపానికి పూల అలంకరణ చేయని అధికారులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES