- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం రాఖీ పండుగను పురస్కరిచుకుని అంతాపూర్ గ్రామానికి చేరుకున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నాచెళ్లెళ్ళ బంధానికి ప్రతీకగా స్థానిక సోదరీమణులతో రాఖీలు కట్టించుకున్నారు. ఈ సందర్భంగా ఆడపడుచులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షులు బన్సి పటేల్, మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు దారస్ సురేష్, మండల బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు గంగాధర్, మండల నాయకులు హనుమంత్ పటేల్, అప్పారావు పటేల్, హనుమంత్ పటేల్ లతో పాటు అంతాపూర్ గ్రామ పార్టీ అధ్యక్షులు వాగుమరే మారుతి మొగుడే గంగారం కూడా పాల్గొన్నారు.
- Advertisement -



