నవతెలంగాణ – సిరిసిల్ల
16 మాసాల క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రజలు ప్రజాపాలనకు అవకాశం ఇచ్చారని, గత పదేళ్లు అరాచక పాలన సాగడంతో ప్రజలు చరమగీతం పాడారని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనీ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూగతంలో పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తూ ముందుకు పోతున్నామని,గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలను కూడా రద్దు చేయకుండా వాటిని కొనసాగిస్తూ నూతన పథకాలను అమలు చేస్తున్నామని,గత ప్రభుత్వంలో ఉన్న ఆ నలుగురు కాస్త ఇప్పడు ఇద్దరు అయ్యారు..ఎన్నికలకు ముందు చెప్పినట్లుగా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నాం..మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,500 సిలిండర్,10 లక్షల అరోగ్య శ్రీ,ఇందిరమ్మ ఇల్లు, సన్నం బియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నం..నేతన్నలు గత ప్రభుత్వం పెట్టిన 200 కోట్ల బకాయిలు ఇవ్వడం జరిగిందన్నారు.మన ప్రాంతంలో పడవు పడ్డా ప్రాజెక్టులను నేడు తిరిగి పనులు ప్రారంభం చేసుకున్నాం..ప్రజా ప్రభుత్వంలో వేములవాడ ప్రాంతంలో 200 కోట్ల తో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ మంజూరు చేయడం జరిగింది..రాష్ట్రంలో అభివృద్ధి ,సంక్షేమం రెండు జోడెద్దుల పరిగెడుతుంది..తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలను నెరవేరుస్తూ ప్రజా ప్రభుత్వం ముందుకు పోతుంది..నిరుద్యోగులకు ప్రభుత్వo ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకూ 65 వేల కి పైగా ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఆకాంక్షలకు అనుగుణంగా వారి ఆశయాలను నెరవేరుస్తుంది..ముఖ్యమంత్రి రేవంత్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడారు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES